తోటి విద్యార్థిని హత్య చేసిన మైనరు బాలురు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇద్దరు తోటి విద్యార్థులు కొట్టి చంపి, కాలువలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఆవరణలో సిగరెట్ తాగుతుండగా మోలడ్‌బంద్‌ గ్రామ బిలాస్‌పుర్‌ క్యాంపునకు చెందిన సౌరభ్‌ (12) వీరిని చూశాడు. టీచర్లకు చెబుతానని బెదిరించడంతో సౌరభ్‌ను ఓ మారుమూల ప్రాంతానికి లాకెళ్లి తలపై కొట్టి చంపి కాలువలో పడేశారు. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్‌పుర్‌ సమీప కాలువలో స్కూలు యూనిఫాంతో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్‌ బ్యాగు కూడా కాలువ పక్కనే పడుంది. ఒంటిపై స్కూల్ యూనిఫాం ఆధారంగా విచారణ చేపట్టగా  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట వారిని హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)