ఆసుపత్రిలో చేరిన సిసోడియా భార్య సీమా !

Telugu Lo Computer
0


మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ప్రస్తుతం జుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా భార్య సీమా సిసోడియా (49) తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి, ఆప్‌ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''సీమా సిసోడియా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. పది లక్షల మందిలో ఒకరికి సోకే ఈ వ్యాధితో మెదడు శరీరంలోని ఇతర భాగాలపై నియంత్రణ కోల్పోతుంది'' అని తెలిపారు. సిసోడియా దంపతుల కుమారుడు చదువుల నిమిత్తం విదేశాల్లో ఉండగా, మనీశ్‌ సిసోడియా జైలులో ఉన్నారు. తన భార్య అనారోగ్యం కారణంగా బెయిలు మంజూరు చేయాలని మనీశ్‌ సిసోడియా ముందుగా దాఖలు చేసిన పిటిషనుపై కోర్టు బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)