మంటలు ఆర్సీనా ఆరని రావి చెట్టు !

Telugu Lo Computer
0


తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటరీ నియోజకవర్గమైన ఫూల్ పూర్‌లోని తర్దిహ్ గ్రామంలోవింత ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో సుమారు 200 సంవత్సరాల నాటి రావిచెట్టు ఉంది, దీనిని గ్రామస్తులు వీర్ బాబా పేరుతో పూజిస్తారు. వారం రోజుల క్రితం ఈ చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పిన తర్వాత మరుసటి రోజు మళ్లీ మంటలు చెలరేగాయి. గ్రామంలో మరోసారి ఫైర్ బెల్ మోగింది. రెండోసారి మంటలు ఆర్పేసిన తర్వాత కూడా మూడోసారి మంటలు చెలరేగాయి. వీర్ బాబా ఏదో కోపంతో ఉన్నారని, ఆయన శాంతించే వరకు ఈ మంట మండుతూనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. చెట్టును ఆర్పేందుకు మూడు ట్యాంకర్ల నీటిని ఫైర్ సిబ్బంది ఉపయోగిచారు. అయినా మంటలు ఆరినట్లే ఆరి, మళ్లీ విజృంభిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)