అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, విద్యుత్‌ ఉచితం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజానీకానికి ఆప్‌ హామీల వర్షం కురిపించింది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యంతోపాటు, ఉచిత విద్యుత్‌ని అందించనున్నట్లు ఆప్‌ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ హామీనిచ్చారు. మంగళవారం బీహెచ్‌ఈఎల్‌లోని దసరా మైదాన్‌లో జరిగిన జన సభలో ఈ మేరకు ఆయన ఆ రాష్ట్ర ప్రజానీకానికి హామీలనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ' ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తుందని, ఉద్యోగుల సర్వీస్‌లను రెగ్యులరైజ్‌ చేస్తుందని' ఆయన అన్నారు. ఆప్‌కి అవకాశమిస్తే ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)