మోడీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారు !

Telugu Lo Computer
0


మోడీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం ఖర్గే పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వ ధోరణితో నడిపిస్తోందని, పైగా ప్రభుత్వ పెద్దలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. అదానీ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) కోసం తాము డిమాండ్‌ చేస్తున్నామని, అయితే తాము ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా మైకులు కట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో సభలో గందరగోళం నెలకొందంటూ సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)