ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపటి విచారణను హాజరు కాలేనని లేఖ కవిత పేర్కొన్నారు. ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో వెల్లడించారు. ఈనెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ధర్నా కోసం రేపు మధ్యాహ్నం కవిత ఢిల్లీలోకి వెళ్లనున్నారు. శుక్రవారం జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నాలో పాల్గొననున్నారు.
రేపు హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ !
March 08, 2023
0
Tags