కళ్లకు కండువా కట్టి, కత్తితో పొడిచి హత్య !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మెహ్రాజ్ తన స్నేహితుడు ఇమ్రాన్ భార్య రిజ్వానా సుల్తాన్‌పై శారీరిక సంబంధం కోసం ప్రయత్నించినట్లు, అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో సరసాలాడుతూ శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  చివరకు ఈ విషయాన్ని రిజ్వానా తన భర్త ఇమ్రాన్‌కు తెలియజేసింది. దీని తర్వాత వారిద్దరూ మెహ్రాజ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఇమ్రాన్ మెహ్రాజ్‌ని తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానన్న పేరుతో కళ్లకు కండువా కట్టాడు. ఆపై ఇమ్రాన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దంపతులిద్దరూ మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి, మృతదేహాన్ని కాలువలోకి పారేశారు.  మరోవైపు, మెహ్రాజ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మెహ్రాజ్‌ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఇంటికి వెళుతున్నానని చెప్పి మెహ్రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. విచారణలో పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు అతడిని క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఆ తర్వాత నేరం అంగీకరించి అన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మొండెంనకు చెందిన ఎనిమిది ముక్కలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. తల కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)