ఛత్తీస్గడ్లోని సుర్గుజా జిల్లా మాంఝా తెగకు చెందిన భైంసా గోత్ర ప్రజలు వివాహం సందర్భంగా ఇంటికి వచ్చే వరుడిని గేదెలుగా వేషాలు వేసుకుని, బురద లో పొర్లుతూ ఇలానే ఆహ్వానిస్తుంటారు. మైన్పట్ నర్మదాపుర్ ప్రాంతంలో ఉండే ప్రజల సంప్రదాయమిది. వధువు సోదరులు గేదెల్లా మారిపోయి నడుము వెనుక ఓ తోకను తగిలించుకని బురదలోకి తిగుతారు. గేదెల్లా ప్రవర్తిస్తూ బురదలో పడి దొర్లడం.. పోట్లాడటం, పరిగెత్తడం వంటివి చేస్తుంటారు. అనంతరం ఊరేగింపుగా వచ్చిన వరుడికి స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్తారు. తరతరాలుగా వస్తున్న ఈ వివాహ సంప్రదాయాన్ని వారు ఇప్పటికీ కొనసాగిస్తుండటం విశేషం.
బురదలో గేదెల్లా పొర్లుతూ వరుడికి ఆహ్వానం !
March 03, 2023
0