ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ర్యాలీలు, సభలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉందన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభకు ప్రజలు సునామీలా వస్తారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా గెలవలేక అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలని వైకాపా నేతలు చూస్తున్నారని, వారి ఆగడాలకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మహనోహర్ అభినందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జనసేన జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ 10వ ఆవిర్భావ సభకు జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయన్నారు.
జనసేన ఆవిర్భావసభ ర్యాలీలు, సభలపై ఆంక్షలు
March 13, 2023
0
Tags