కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 March 2023

కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఆమె అందించిన మొబైల్ ఫోన్లను తాము తెరిచేందుకు సిద్దమయ్యామని, ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావాలని లేఖలో తెలిపారు. లేదంటే తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. కవిత తరపున ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు.

No comments:

Post a Comment