ఆస్తి కోసం కన్న తండ్రిని సజీవదహనం చేసిన కూతుళ్లు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులు (70)కి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు కొంత కాలం క్రితమే వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ముగ్గురు కూతుళ్లకు పెళ్లిలు చేసి అత్తరింటికి పంపించాడు. అయితే భార్య సరిగ్గా చూసుకోకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతోనే కలిసి జీవిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి ఆంజనేయులుతో కూతుళ్లు ఆస్తి కోసం గొడవ పడున్నారు. ఆదివారం చిన్న కూతురు బిడ్డ పెళ్లి విందు కామారెడ్డిలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే తండ్రికి ఇంట్లో తాళం పెట్టి ఉంచి విందుకు వెళ్లారు. ఆదివారం రాత్రి కన్న తండ్రిని చంపేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. కాపాడండి, మంటలు అంటుకున్నాయని ఆంజనేయులు కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కాపాడే ప్రయత్నం చేయడంతో కూతుర్లు అడ్డుపడ్డారని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చారు. మాంసపు ముద్దగా పడి ఉన్న ఆంజనేయులు శవాన్ని బయటకు తీశారు. తల, మొండెం విడిపోయినట్లు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)