మటన్ తిని చిన్నారి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని అల్లూరి సీతరామరాజు జిల్లా అరుకులోయ మండలం గన్నేల పంచాయతి తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్ తెచ్చుకొని వండుకొని కుటుంబ సభ్యులందరూ తిన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి మీనాక్షి చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా ఎనిమిది మంది కుటుంబ సభ్యుల పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలిస్తామని వైద్యులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)