రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురవడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్సభ సచివాలయం సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాజ్యసభ ఎంపి, మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేసిన కపిల్ 'చిల్లర మనుషులు.. చిల్లర రాజకీయాలే చేస్తారు' అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, కపిల్ సిబల్ యుపిఎ 1-2, ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇక గతేడాది మేలో కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.
'చిల్లర మనుషులు - చిల్లర రాజకీయాలే చేస్తారు'
March 28, 2023
0
Tags