అపార్ట్ మెంట్ ధర రూ.369 కోట్లు !

Telugu Lo Computer
0


ముంబై సిటీలోని వాకేశ్వర్ రోడ్డులో అరేబియా మహా సముద్రం ఒడ్డున లోధా కంపెనీ నిర్మిస్తున్న మలబార్ హిల్స్ టవర్స్ లో ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత జేపీ తపారియా కొనుగోలు చేశారు. ఈ టవర్ లోని 26, 27, 28 ఫ్లోర్ల మొత్తాన్ని బుక్ చేశారు. లగ్జరీ ట్రిబులెక్స్ ప్లాట్ గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. మూడు ఫ్లోర్లు కలిపి మొత్తం 27 వేల 160 స్కైర్ ఫీట్ విస్తీర్ణం ఉండగా, ఒక్కో స్కైర్ ఫీట్ ధర లక్షా 36 వేల రూపాయల ధర పలికింది. ఈ లెక్కన 369 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ జేపీ తపారియా చేసుకున్నారు. ఇండియాలోనే ఇది అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే టవర్ లో 121 కోట్ల రూపాయలతో మాధవ్ గోల్ అనే పారిశ్రామికవేత్త 19వ ఫ్లోర్ మొత్తాన్ని తీసుకున్నారు. అప్పట్లో అదే రికార్డ్ అనుకుంటే.. ఇది అంతకు మూడింతలు కావటం విశేషం. హైరైజ్ టవర్స్ లో అపార్ట్ మెంట్ పై 369 కోట్ల రూపాయల డీల్ జరగటం ఇదే ప్రథమం కావటంతో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం అవాక్కయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)