నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 255/4

Telugu Lo Computer
0


గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 90 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఖవాజా (104 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా,  ట్రావిస్ హెడ్ (32), స్టివెన్ స్మీత్ (38), పీటర్ హండ్స్‌కోంబ్ (17) పరుగులు చేసి ఔటయ్యారు. ఖవాజాతోపాటు కామెరూన్ గ్రీన్ (49 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూనే వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో ఆసీస్ తొలి రోజు టీమిండియాపై పై చేయి సాధించింది.ఇక, భారత బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)