విప్లవ్‌ దేవ్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం !

Telugu Lo Computer
0


త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్‌ దేవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, డ్రైవర్‌ చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో విప్లవ్‌ దేవ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. దాంతో ఎంపీ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని జీటీ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఎంపీ విప్లవ్‌ దేవ్‌ కార్యాలయం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పానిపట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)