ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలోని ధకర్ గ్రామంలో అనూజ్ అనే ఏడాది బాలుడు అనారోగ్యం బారినపడ్డాడు. దాంతో కుటుంబసభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. బాలుడిని బాగుచేసే పేరుతో ఆ మంత్రగాడు అతడిని నేలకేసి కొట్టాడు. అంతేగాక, బాలుడి నోట్లోని పళ్లను విరగ్గొట్టాడు. దాంతో ఆ పసిబిడ్డ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దాంతో బాధిత కుటుంబం బాలుడి భౌతికకాయాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాంత్రికుడి వికృత చేష్టలకు చిన్నారి బలి
February 10, 2023
0
Tags