క్రూయిజ్ మిస్సైల్‌తో ట్రంప్‌ను చంపేస్తాం !

Telugu Lo Computer
0


ఇరాన్ డెవలప్ చేసిన కొత్త తరహా పావే క్రూయిజ్ మిస్సైల్‌ 1650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను  చేధించగలదు. ఈ విషయాన్ని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ తెలిపారు. తమ టాప్ కమాండర్‌ను చంపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఈ క్షిపణిని వాడనున్నట్లు రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమిరాలి హజిజాదే తెలిపారు. 1650 కిలోమీటర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ అమ్ములపొదిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ వార్‌లో ఇరాన్ తయారు చేసిన మిస్సైళ్లనే రష్యా వాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పేద సైనికులను చంపేందుకు తాము క్షిపణులను తయారు చేయలేదని, తమ కమాండర్ ఖాసిమ్ సులేమాని హతమార్చిన వారిని చంపేందుకు ప్రతీకారంతో ఉన్నట్లు హజిజాదే తెలిపారు. ట్రంప్‌, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి పాంపియో, సులేమాని హత్యకు ఆదేశాలు ఇచ్చిన మిలిటరీ కమాండర్లను హతమార్చనున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)