న్యూజీలాండ్ ను వణికిస్తున్న గాబ్రియెల్ తుపాను

Telugu Lo Computer
0


గాబ్రియెల్ తుపాను న్యూజీలాండ్‌ దేశాన్ని వణికిస్తోంది. అక్లాండ్, నార్త్‌ల్యాండ్, కోరమండల్, బే ఆఫ్ ప్లెంటీ సహా 9 రాష్ట్రాల్లో నేషనల్ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు న్యూజీలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజీలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇప్పటి వరకు నార్త్‌ల్యాండ్‌లో 58 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్టు న్యూజీలాండ్ మీడియా చెబుతోంది.   అక్లాండ్ లోని ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఓ ఫైర్ ఫైటర్ గల్లంతయ్యారు. పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చెయ్యాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ అత్యవసర పరిస్థితుల్లో తమ వెంట ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాలో జాతీయ విపత్తుల నిర్వహణ వ్యవస్థ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది. అక్లండ్‌లో ముందు జాగ్రత్తగా 50 అపార్మెంట్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అవి ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిల్లో 109 ఏళ్ల క్రితం నిర్మించిన మౌంట్ ఎడిన్ స్టీల్ టవర్ కూడా ఉంది. గాబ్రియెల్ తుపాను ప్రభావం న్యూజీలాండ్‌ జనాభాలో సుమారు మూడోవంతు మందిపై ఉండబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందలాది విమానాలను రద్దు చేశారు. పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. తుపాను ప్రభావం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉండబోతోందని అధికారులు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)