మొబైల్‌ మింగిన ఖైదీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 February 2023

మొబైల్‌ మింగిన ఖైదీ !


బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కైసర్‌ అలీ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడు ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో కైసర్‌ మొబైల్‌ ఫోన్‌ వాడేవాడు. శనివారం రాత్రి అతను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా, అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వచ్చాడు. కానిస్టేబుల్ రావడం చూసి కైసర్ అలీ భయపడి మొబైల్ ఫోన్ మింగేశాడు. కొద్దిసేపటికే కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైంది. కడుపునొప్పి గురించి జైలు అడ్మినిస్ట్రేషన్‌కి చెప్పి మొబైల్‌ను మింగినట్లు చెప్పాడు. ఇది విని జైలు సిబ్బంది షాకయ్యారు. హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సదరు ఆసుపత్రికి తరలించారు. పట్టుబడతామనే భయంతో ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో శనివారం రాత్రి సదర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. వైద్యులు అతడిని పరీక్షించగా కడుపులో ఫోన్‌ కనిపించింది. సదర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నియమించబడిన డాక్టర్ సలాం సిద్ధిఖీ, ఖైదీ కైసర్ అలీని కడుపు నొప్పి ఫిర్యాదుతో మండల్ జైలు నుండి తీసుకువచ్చినట్లు చెప్పారు. అతడి పొట్టను ఎక్స్‌రే తీయగా అందులో ఫోన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 


No comments:

Post a Comment