నదిలో స్నానానికి వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 February 2023

నదిలో స్నానానికి వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి


ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో నిన్న సాయంత్రం నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోయారని తెలుసుకున్న వెంటనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు ఎనిమిది గంటల తర్వాత ఇవాళ ఉదయం విద్యార్థులు జై మౌర్య (26), పవన్ యాదవ్ (24), నవీన్ సెంగార్ (22) మృతదేహాలను ఘాట్ కి 500 మీటర్ల దూరంలో గత ఈతగాళ్లు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలేజీ విద్యార్థులు ఐదుగురు కళాశాల సిబ్బందికి చెప్పకుండా కచ్చల గంగా ఘాట్ వద్ద స్నానానికి వెళ్లారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేంద్ర గుప్తా చెప్పారు. నిన్న వారిలో ఇద్దరిని మాత్రమే గత ఈతగాళ్లు రక్షించగలిగారని చెప్పారు. మృతులు జై మౌర్య, పవన్ యాదవ్, నవీన్ సెంగార్ వరుసగా జౌన్ పూర్, బళ్లియా, హథ్రాస్ ప్రాంతాలకు చెందిన వారని వివరించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల పేర్లు ప్రమోద్ యాదవ్, అంకుశ్ గెహ్లాట్ అని వివరించారు. వారిద్దరు రాజస్థాన్ లోని గోరఖ్ పూర్, భరత్ పూర్ కు చెందిన వారని చెప్పారు.

No comments:

Post a Comment