ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడంపై ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పొట్టన కొటకండి అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు మిర్చి అమ్మడం ఆపివేయాల కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈనేపథ్యంలో రైతులపై కమిషన్ దారులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. మేము న్యాయంగా చేస్తుంటే కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. ఈనేపథ్యంలో రైతులకు గాయాలు కాగా ఈ ఘటనలో కమిషన్ దారులకు చొక్కాలు చిరిగాయి. ఈఘటనపై స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అదుపులో తీసుకున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత !
February 25, 2023
0
Tags