బస్సులో మహిళపై మూత్రం పోసిన యువకుడు

Telugu Lo Computer
0


కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన నాన్-ఎసీ స్లీపర్ బస్సు విజయపుర నుండి మంగళూరు వెళ్తోంది. బస్సు హుబ్బల్లి సమీపంలోని కిరేసూర్‌లో ఓ ధాబా వద్ద ఆగింది. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులు టీ, టిఫిన్ కోసం బస్సు దిగారు. ఓ మహిళ 3వ నెంబర్ సీటులో కూర్చొని ఉంది. బస్సులో 28వ సీటు నెంబర్ లో కూర్చున్న రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు మధ్యం మత్తులో ఆమె సీటు దగ్గరకు వచ్చి ఆమె మీద మూత్ర విసర్జన చేశాడు. దాంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, కండక్టర్, మిగతా ప్రయాణికులు బస్సులోకి వచ్చి చూశారు. జరిగింది తెలుసుకొని, రామప్పను తీవ్రంగా తిట్టి, బస్సు నుంచి కిందికి దించేశారు. అనంతరం ధాబా వద్ద ఉన్న పనివారి సాయంతో బస్సులోని ఆమె సీటును శుభ్రం చేయించారు. సదరు మహిళ కూడా ధాబాలో స్నానం చేసి, దుస్తులు మార్చుకొని వచ్చేంత వరకు బస్సును నిలిపి ఉంచారు. తోటి ప్రయాణికులు, బస్సు సిబ్బంది ఆమెకు నచ్చజెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)