సెమీస్‌కు చేరిన భారత్ జట్టు

Telugu Lo Computer
0


మహిళల టీ20 ప్రపంచకప్‌ లో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్‌ పోరుకు అర్హత సాధించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ప్రీత్ సేన.. 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (87; 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీకి చేరువలో ఔటైంది. షెఫాలీ వర్మ (24), జెమీమీ రోడ్రిగ్స్‌ (19) ఫర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో లారా డెలానీ 3, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, ఆర్లీన్ కెల్లీ ఒక వికెట్‌ తీశారు. టీమ్‌ఇండియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఐర్లాండ్‌.. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ గెలుపు కోసం ఆ సమయానికి చేయాల్సిన స్కోరు 59. దీంతో టీమ్‌ఇండియాను విజేతగా ప్రకటించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)