సన్యాసం స్వీకరించిన సంపన్న కుటుంబం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని భుజ్‌ కు చెందిన ఓ కుటుంబం మొత్తం సన్యాసం స్వీకరించింది. ఇంతకాలం తాము సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిని దానం చేస్తున్నట్లు ప్రకటించింది. కుటుంబంలోని నలుగురూ కలిసి దీక్ష చేపట్టినట్లు, దీక్ష నియమనిబంధనల ప్రకారం తమ సంపదనంతా దానం చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది. భుజ్‌కు చెందిన పూర్వీ బెన్ మెహతా కుటుంబం జైనా మతానికి చెందినవారు. వీరి కుటుంబ సభ్యులంతా భగవతి దీక్షను స్వీకరించారు. మిలియనీర్ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన వీరు దుస్తుల వ్యాపారంలో బాగానే సంపాదించారు. వీరి టర్నోవర్ ఏడాది కోటి రూపాయలు పైగానే ఉంటుంది. పూర్వీ బెన్ మెహతా, పీయూష్ మెహతా, కుమారుడు మేఘ్ కుమార్, మేనల్లుడు క్రిష్ భగవతి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మహావ్రతాలు, బ్రహ్మచర్యం, ఆచార్య, పాదయాత్ర వంటివి ఉంటాయి. ఈ దీక్షను స్వీకరించిన వారు జీవితాంతం విద్యుత్ వినియోగానికి దూరంగా ఉండాలి. డబ్బు లేకుండా జీవించాలి. దీంతో పాటు జీవితాంతం కూడబెట్టిన మూల ధనాన్ని విరాళంగా ఇవ్వాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)