ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా ప్రవర్తన చర్చనీయాంశమైంది. ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అనితా ప్రధాన్ పట్ల ఆయన ప్రవర్తన తీరుపై మహిళా లోకం మండిపడుతున్నది. పోలీసు అధికారిణీతో బీజేపీ ఎమ్మెల్యే ఘర్షణ పడిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయంటూ బుధవారం సంబల్పుర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు లోపలికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా తాను నిలువరించానని తెలిపారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే 'లంచగొండి, బందిపోటు.. చెంప పగలగొడతానంటూ చేయి చూపించారు. అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. నా మొహంపై చేయిపెట్టి వెనక్కి నెట్టేశారు.'అని అనితా ప్రధాన్ చెప్పారు. అనంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మరోపక్క అధికార బిజూ జనతాదళ్ మిశ్రా తీరును విమర్శించింది. ఇలా బెదిరింపులకు దిగడం ఆయనకు పరిపాటేనని, ఆయనపై హత్య కేసు సహా 14 కేసులున్నాయని తెలిపారు.
పోలీస్ అధికారిణిపై బీజేపీ ఎమ్మెల్యే దాడి
February 16, 2023
0
Tags