జనాలపై నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్ !

Telugu Lo Computer
0


గుజరాత్ మోహసానాలో తన మేనల్లుడి పెళ్లిలో ఓ మాజీ సర్పంచ్ రూ. 500 నోట్లను వర్షంగా కురిపించారు. అగోల్ గ్రామ మాజీ సర్పంచ్ మేనల్లుడి వివాహ వేడుకల్లో తన ఇంటి పై నుంచి డబ్బుల వర్షం కురిపించారు. గుజరాత్ లోని కేక్రీ తహసీల్ లోని అగోల్ గ్రామానికి మాజీ సర్పంచ్ గా పనిచేసిన కరీం యాదవ్ తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా రూ.500 నోట్లను డాబా పై నుంచి వెదజల్లాడు. ఈ వివాహ వేడుకలను చూసేందుకు గుమిగూడిన ప్రజలు వర్షంగా కురుస్తున్న నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ మూవీ జోధా అక్బర్ లోని 'అజీమ్-ఓ-షాన్ షెహెన్‌షా' బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, నోట్లను వెదజల్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువరు నెటిజెన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)