22న ఢిల్లీ మేయర్ ఎన్నికలు జరపండి !

Telugu Lo Computer
0


ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రజాస్వామ్య విజయంగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు. "నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. రెండున్నర నెలల తర్వాత ఢిల్లీకి మేయర్‌ రానున్నారు. ఢిల్లీలో ఎల్జీ, బీజేపీ నిత్యం చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని కోర్టులో రుజువైంది" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)