తెలంగాణలోని జనగాంలో నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన ట్యాంక్ నుంచి క్లోరిన్ వాయువు లీక్ కాగా, దానిని పీల్చిన 20 మంది అస్వస్థులయ్యారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్నవారు ఊపిరిపీల్చుకోవడం కష్టంగా ఉందని, దగ్గొస్తుందని, వాంతులొస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వారిని గురువారం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరాక వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. వారికి చికిత్స అందుతోంది. అయితే వారిలో కొందరిని డిశ్చార్జి కూడా చేశారు. కాగా ఈ విషయంపై అధికారులు దర్యాప్తును చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చాక జనగాం పట్టణవాసులు కాస్త కుదుటపడ్డారు.
క్లోరిన్ వాయువు పీల్చిన 20 మందికి అస్వస్థత !
February 17, 2023
0
Tags