ఆటో బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 10 February 2023

ఆటో బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలు


తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ఆటో బోల్తా పడి 14 మంది కూలీలు గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కూలీలు వాజేడు మండలంలోని ఓ రైతు మిర్చి కోతల పని కోసం ఆటో లో వెళ్తుండగా జగన్నాధపురం గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మోదని వెన్నెల, సొగలం రవి, సబక సీత, సొగలం రామి, సామల సాంబి, మార శ్రీను, కోగిల కుమారి, సబక రమేష్, సోయం ఓంగి, సోలం మోతే లకు తీవ్ర గాయలవగా దొడ్డి సుక్లి, సోడి దూలయ్య, పూనెం శ్రీను, సబక మంగ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు ఆటో యూనియన్ సభ్యులు హూటహూటిన క్షతగాత్రులను వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతి రావు ప్రమాదానికి గల కారణాలు సేకరించారు. క్షతగాత్రులకు వాజేడు వైద్యశాలలో చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

No comments:

Post a Comment