ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పాత్రికేయ సమావేశం నిర్వహించి సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలను వెల్లడించారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎనిమిది జిల్లాలు 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో మ్రోగిన ఎన్నికల నగారా !
January 18, 2023
0
Tags