ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు, లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దహను తాలూకాలోని చరోతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయం సమీపంలో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం గుజరాత్ నుంచి ముంబై వైపు వస్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పి లగ్జరీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ప్రమాదంలో లగ్జరీ బస్సు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాసాలోని ఉప జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టంకు తరలించారు. జనవరి 8న కూడా ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
హైవే రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
January 31, 2023
0
Tags