లోయలో జారిపడి ముగ్గురు సైనికులు మృతి

Telugu Lo Computer
0


జమ్ముకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచల్ సెక్టార్‌లో బుధవారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారి పడి మరణించారు. పెట్రోలింగ్ చేస్తుండగా, చినార్ క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారి పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు . ట్రాక్‌పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)