దేశంలోని సురక్షితమైన, అత్యంత విశ్వసనీయమైన బ్యాంకుల పేర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇటువంటి జాబితాను రిజర్వ్ బ్యాంక్ 2015 నుంచి ప్రచురిస్తూనే ఉంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైన బలమైన బ్యాంకింగ్ విధానం చాలా ముఖ్యం. బ్యాంకుల పనితీరు కేవలం వినియోగదారులు మాత్రమే కాక ప్రభుత్వాలు కూడా గమనిస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగా దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకుల-2022 జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో మెుత్తం మూడు బ్యాంకులను ఎంపిక చేయగా రెండు ప్రైవేటు రంగానికి, ఒకటి ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు ఉన్నాయి. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్బీఐతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్బీఐ విడుదల చేసిన తాజా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశీయ వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకుల ఈ జాబితాలో పతనం లేదా వైఫల్యం జరిగితే అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అలాంటి బ్యాంకులపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.
సురక్షితమైన బ్యాంక్ లు
January 03, 2023
0