మూడో వన్డేలో గాయపడ్డ శ్రీలంక ఆటగాళ్లు !

Telugu Lo Computer
0


తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్‌ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు. భారత ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు.

Post a Comment

0Comments

Post a Comment (0)