నేపాల్‌లో కుప్పకూలిన విమానం

Telugu Lo Computer
0


నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్న యెటి ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం కుప్పకూలింది. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంకు, పాత విమానాశ్రయానికి మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. యెటి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ఈ వివరాలను నేపాలీ మీడియాకు తెలిపారు. మరో వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దుర్ఘటన పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై జరిగినట్లు తెలుస్తోంది. సహాయ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని, విమానాశ్రయాన్ని మూసేశారని సమాచారం. ప్రయాణికుల పరిస్థితి గురించి ఇంకా సమాచారం అందలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)