డిసెంబర్ లో పెరిగిన జీఎస్టీ ఆదాయం

Telugu Lo Computer
0


డిసెంబర్‌ 2022కి సంబంధించి జీఎస్టీ 1.4 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ రాబడి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ రకంగా చూస్తే జీఎస్టీ వసూళ్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. డిసెంబర్ 2022లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,49,507 కోట్లు కాగా, ఇందులో CGST వాటా రూ. 26,711 కోట్లు. ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.33,357 కోట్లు కాగా, ఐజీఎస్టీ వసూళ్లు రూ.78,434 కోట్లుగా ఉన్నాయి. ఈ ఐజీఎస్టీలో వస్తువుల దిగుమతి నుండి మొత్తం రూ. 40,263 కోట్లు ఉండగా, ఇది కాకుండా సెస్ వాటా రూ.11,005 కోట్లు కాగా ఇందులో రూ.850 కోట్లు వస్తువుల దిగుమతి ద్వారా అందింది. సాధారణ సెటిల్‌మెంట్‌గా రూ.36,669 కోట్ల సీజీఎస్‌టీ వాటాను, రూ.31,094 కోట్ల ఎస్‌జీఎస్‌టీని ప్రభుత్వం సెటిల్ చేసింది. డిసెంబర్ 2022లో, రాష్ట్రాలు, కేంద్రం సాధారణ సెటిల్‌మెంట్ తర్వాత సీజీఎస్టీ కింద రూ. 63,380 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 64,451 కోట్లు పొందాయి. అంతకు ముందు ఏడాది  కంటే 15 శాతం ఎక్కువ వచ్చింది. డిసెంబర్ 2022లో వస్తువుల దిగుమతి నుండి వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8 శాతం ఎక్కువ, దేశీయ లావాదేవీలు (వీటిలో సేవల దిగుమతి కూడా) 18 శాతం ఎక్కువ. ఇక నవంబర్ 2022లో 7.9 కోట్ల ఇ-వే బిల్లులు ఉండగా, ఇది అక్టోబర్ 2022తో పోలిస్తే మంచి వృద్ధిని సాధించింది. అక్టోబర్ 2022లో 7.6 కోట్ల ఇ-వే బిల్లులు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)