తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూనే వచ్చాయి. పసిడి రేటు రూ. 330 మేర దిగి వచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు ఇప్పుడు రూ. 55,960 వద్ద ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 51,300గా ఉంది. వెండి రేటు గత రెండు రోజుల్లో ఒక రోజు పెరిగింది. మరోరోజు తగ్గింది. వెండి రేటు జనవరి 10న రూ. 1200 మేర పడిపోయింది. అయితే నిన్న వెండి రేటు రూ. 300 పైకి చేరింది. అంటే వెండి రేటు ఒక పెరిగింది. మరో రోజు దిగి వచ్చింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కేజీకి రూ. 74 వేల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. పసిడి రేటు ఔన్స్‌కు 1880 డాలర్లకు పైనే కదలాడుతోంది. ఇక వెండి ధర అయితే ఔన్స్‌కు 23.56 డాలర్ల వద్ద ఉంది. అంటే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పై స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే దేశీ మార్కెట్‌లో మాత్రం కొంత మేర క్షీణించాయి. కాగా ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ. 62 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)