టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బుధవారం నుంచి స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. టీఎస్ఆర్టీసీకి మొట్ట మొదటిసారిగా 10 బస్సులు సమకూరాయి. వీటిలో పూర్తి స్లీపర్ బస్సులు 4 కాగా, 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఇవి హైదరాబాద్ - కాకినాడ, హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. కేపీహెచ్బీ కాలనీ బస్సు స్టాపు దగ్గర బుధవారం సాయంత్రం 4 గంటలకు వీటిని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయి.
హైదరాబాద్ నుండి ఏపీకి టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు
January 04, 2023
0