గణతంత్ర దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో హరియాణాలోని గురుగ్రామ్ లో డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, గాలిపటాలు, చైనా తయారీ మైక్రోలైట్లపై నిషేధం విధించింది. జనవరి 26 వరకు ఇది అమల్లో ఉండనుంది. 144 సెక్షన్ కింద డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సైబర్ కేఫ్, గెస్ట్ హౌస్లు, హోటళ్ల యజమానులకు పలు సూచనలు చేశారు. సందర్శకులు, అతిథుల ఐడీ కార్డులను భద్రపరచాలని, రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. 'గణతంత్ర దినోత్సవ వేడుక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తలో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చాం. వీటిని ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి' అని హెచ్చరించారు.
గురుగ్రామ్ లో డ్రోన్లు, గాలిపటాలపై నిషేధం
January 14, 2023
0
Tags