మెట్రో రైలులో పిల్లలతో ప్రధాని ముచ్చట్లు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని  నాగ్‌పూర్ నుంచి బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనితోపాటు రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు టిక్కెట్ కొనుక్కుని, కొంతమంది పిల్లలతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. నాగ్‌పూర్‌లో ఆదివారం నాగ్‌పూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు ఏర్పాటైన మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఈ రైళ్లను జాతికి అంకితం చేశారు. తర్వాత మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖాప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు ప్రయాణించే ఒక రైలును, ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ వరకు వెళ్లే మరో రైలును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లో టిక్కెట్ కొనుక్కున్న ప్రధాని, కొంతమంది విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)