అన్నామలై రఫేల్ వాచ్ ధరించడం పట్ల వివాదం !

Telugu Lo Computer
0


ఫ్రెంచ్ కంపెనీ రఫేల్‌కు చెందిన అత్యంత ఖరీదైన చేతి గడియారాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై ధరించడం పట్ల వివాదం చెలరేగుతోంది. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ, అన్నామలై మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే  తాను ఆ వాచీని కొనుగోలు చేసినట్లు అన్నామలై తెలిపారు. కావాలంటే ఆ వాచీకి చెందిన బిల్లును కూడా ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని మంత్రి బాలాజీ ట్విట్టర్‌లో లేవనెత్తారు. జాతీయవాదం వినిపించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విదేశీ రిస్ట్ వాచీను ఎలా ధరించారని ప్రశ్నించారు. ఒక గంటలో ఆ వాచీ ఖరీదు చేసిన బిల్లును చూపిస్తారా అని అడిగారు. లిమిటెడ్ ఎడిషన్‌కు చెందిన రఫేల్ వాచీ ఖరీదు సుమారు 5 లక్షలు ఉంటుంది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అన్నామలై.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరారు. కేవలం గొర్రెలు, ఆవులు ఉన్నాయని చెప్పుకునే బీజేపీ అధ్యక్షుడికి ఖరీదైన రఫేల్ వాచీ ఎలా వచ్చిందని మంత్రి బాలాజీ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)