రాజస్థాన్ మంత్రి సలేహ్ మహ్మద్కు చెందిన రాసలీలల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మంత్రి మహ్మద్, ఓ మహిళ అభ్యంతకరంగా ఉన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే, బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలను మంత్రి మహ్మద్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవని, అదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. కాగా, ఈ వీడియో వ్యవహారంపై డిసెంబర్ 5వ తేదీన బాధిత మహిళ జోధ్పూర్లోని షేర్గఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన వీడియోను పొరపాటున తీశారని, తన 7 ఏళ్ల కూతురు ఫోన్లో గేమ్ ఆడుతూ పొరపాటున మరొకరికి ఆ వీడియోను ఫార్వార్డ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఆ విషయం తనకు తెలియదని స్పష్టం చేసింది. రెండు నెలల క్రితం తన బంధువుల వద్దకు వెళ్లగా, వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరించారని మహిళ ఆరోపించింది. రూ. 25 లక్షల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో మనస్తాపానికి గురైన తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించినట్లు మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోకరన్కు చెందిన పంకజ్ విష్ణోయ్, వికాస్, రాంజాస్ విష్ణోయ్, సుమిత్ విష్ణోయ్, రవీంద్ర విష్ణోయ్ లను అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ మంత్రి హనీట్రాప్ ?
December 08, 2022
0
Tags