డబ్బు కోసం పీహెచ్ డీ స్కాలర్ ను హత్య చేసిన ఇంటి యజమాని

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, మోదీనగర్ లో నివాసముంటున్న ఉమేశ్ శర్మ అనే వ్యక్తి తన ఇల్లును పీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి అంకిత్ ఖకోర్ (45)కు అద్దెకు ఇచ్చాడు. తల్లీదండ్రులు మరణించడంతో అంకిత్ గత కొన్నేళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఉమేశ్ శర్మ, అంకిత్ మధ్య స్నేహం ఏర్పడింది. అంకిత్ తన వారసత్వ ఆస్తిని విక్రయించగా 1 కోటి రూపాయలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని ఉమేశ్ రూ.40 లక్షలు అప్పు ఇవ్వాలని అడగ్గా అంకిత్ ఇచ్చాడు. రూ.40 లక్షలు తిరిగి చెల్లించకుండా మిగిలిన రూ.60 లక్షలను కూడా కాజేయాలనుకున్నాడు. అందుకుగానూ అంకిత్ ను చంపాలని ఇంటి యజమాని ఉమేశ్ ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు పర్వేశ్ సాయంతో ఉమేశ్ అక్టోబర్ 6వ తేదీన అంకిత్ గొంతు కోసి హత్య చేశారు. ఆపై అతడి శరీరాన్ని మూడు ముక్కులుగా కోసి కాలువలో వేర్వేరు చోట్ల విసిరేశారు. అనుమానం రాకుండా డబ్బులు డ్రా చేసేందుకు పర్వేశ్ ను ఉమేశ్ ఉత్తరాఖండ్ కు పంపించాడు. అంకిత్ ఏటీఎం కార్డు ద్వారా రూ.20 లక్షలు డ్రా చేశాడు. స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ చేసినా అంకిత్ సమాధానం ఇవ్వకపోవడం, టెక్ట్స్ మెస్సేజ్ లలో వ్యక్తీకరణ తేడాగా ఉండటంతో అతని ఇంటికి వెళ్లారు. అక్కడ అంకిత్ కనిపించకపోవడంతో అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)