శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగాలు

Telugu Lo Computer
0


ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో రేపు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పార్టీ కేంద్ర కార్యాలయం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మంగళ, బుధవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్‌ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్‌ కుమార్‌ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజతో కలిసి మూడు రోజులుగా యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల సంస్కారం,యాగశాల ప్రవేశం, చండి పరాయణములు,మూల మంత్ర జపములు తదితన కార్యక్రమాలు జరుగనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)