గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు పూర్తిగా తప్పని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ప్రజలు నిరూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడయ్యాక ఈ విషయాలు అందరికీ అర్థమవుతాయని చెప్పారు. గుజరాత్లో మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమ పార్టీ 15 నుంచి 20శాతం ఓట్లు సాధించడం గొప్ప విషయమని కేజ్రీవాల్ అన్నారు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు. గుజరాత్లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ రెండో స్థానం, ఆమ్ ఆద్మీ పార్టీ మూడో ప్లేస్కు పరిమితమవుతాయని తెలిపాయి. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ ఆప్ వైపే మొగ్గు చూపాయి.ఎంసీడీలో మొత్తం 250 వార్డులు ఉండగా, కావాల్సిన మెజారిటీ 126. అయితే ఆప్ కు 145కు పైగానే సీట్లు వస్తాయని అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి !
December 06, 2022
0
Tags