తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండ లం గంట్లవెల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మా టీచర్లు మాకు కావాలి అని బడి గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. ఏడో తరగతి వరకు ఉన్న ఈ బడిలో గంట్లవెల్లితోపాటు చుట్టుపక్కల తండాలకు చెందిన మొత్తం 130 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇక్కడి అవసరాల రీత్యా ఈ స్కూల్ను మన ఊరు- మన బడి పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. ఇందులో మొత్తం 8 మంది టీచర్లు ఉన్నారు. వీళ్లలో హెడ్మాస్టర్, మరో టీచర్ డిప్యుటేషన్పై వెళ్లగా, మరో ఇద్దరు సెలవుపై వెళ్లినట్లు చెప్తున్నారు. ఉన్న నలుగురు టీచర్లలో ఒకరు సెలవులో ఉండటంతో మిగిలిన ముగ్గురే విధుల్లో ఉన్నారు. దీంతో పాఠాలు చెప్పేవాళ్లేరి అంటూ పిల్లలు ఆందోళన చేపట్టారు. ఇంత తక్కువ స్టాఫ్తో అన్ని క్లాసుల పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా సాధ్యంకావట్లేదని టీచర్లు తెలిపారు. ఆందోళన విషయాన్ని స్థానిక ఎంఈవో శంకర్ రాథోడ్ జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. ఆయన వెంటనే స్పందించి ఆ స్కూల్ టీచర్ల డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారిని వెంటనే విధుల్లో చేరాలంటూ ఆదేశాలివ్వాలని ఏంఈవోకు చెప్పారు. దీంతో డిప్యుటేషన్లో ఉన్నోళ్లను వెంటనే రప్పిస్తామని శంకర్ రాథోడ్ ఆ స్కూల్ పిల్లలకు తెలియజేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
మా టీచర్లు మాకు కావాలి !
December 20, 2022
0