హిమాచల్‌లో గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్‌ను శుక్రవారం కాంగ్రెస్ నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. తమ పార్టీ ఎమ్మెల్యేల వివరాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందచేశారు. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాజీవ్ శుక్లా, పార్టీ పరిశీలకులు భూపేష్ భఘేల్‌, బీఎస్ హుడా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ సీఎం అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. సీఎంను ప్రకటించేందుకు పార్టీ పరిశీలకులు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం రేసులో మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్, సీఎల్పీ మాజీ నేత ముఖేష్ అగ్నిహోత్రి సహా పలువురు నేతలు పోటీలో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)