మాట నిలబెట్టుకున్న రాహుల్ !

Telugu Lo Computer
0


భారత్​ జోడో యాత్రలో భాగంగా నవంబర్​ 29న మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చేరిన రాహుల్​ అక్కడున్న ఓ ప్రభుత్వ పాఠశాల చిన్నారులతో ముచ్చటించారు. వారిలో కొంత మందిని తమ జీవిత లక్ష్యాలను అడగగా వారు పైలట్​ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. అయితే మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా అని రాహుల్​ అడగగా, వారు లేదని సమాధానం ఇచ్చారు. దీంతో మిమ్మల్ని త్వరలోనే హెలికాప్టర్​లో తిప్పుతానని మాట ఇచ్చారు రాహుల్​. బుధవారం 10,11వ తరగతి విద్యార్థులను పిలిపించిన రాహుల్​ వారితో పాటు ప్రిస్సిపల్​ను సైతం హెలికాప్టర్​లో తిప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు వారందరిని తిప్పించారు. ఆ సమయంలో హెలికాప్టర్​ గురించి చిన్నారులకు వివరించారు. బుధవారం జరిగిన ఈ హెలికాప్టర్​ ప్రయాణాన్ని తాము ఎన్నడు మరచిపోమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్​ రైడ్ ​నుంచి తిరిగి వచ్చాక చిన్నారులు రాహుల్​కు ఓ పెయింటింగ్​ను బహుకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)