జింబాబ్వేపై భారీ విజయం

Telugu Lo Computer
0


టీ20 ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లో భారత జట్టు జింబాబ్వేపై విజయం సాధించింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రపంచకప్‌లో మరొక అర్థ సెంచరీ సాధించాడు. 25 బంతుల్లోనే నాలుగు సిక్స్‌లు, ఆరు ఫోర్ల సహాయంతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. మూడేసి సిక్స్‌లు, ఫోర్ల సహాయంతో 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ 15 పరులుగు, రిషభ్ పంత్ 3 పరుగులు చేశారు. జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ర్యాన్ బర్ల్ 35 పరుగులు, సికందర్ రజా 34 పరుగులు, క్రెగ్ ఇర్విన్ 13 పరుగులు, సీన్ విలియమ్స్ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, పాండ్యా, షమీ చెరొక రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలొక వికెట్ తీశారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 10వ తేదీ గురువారం ఆడిలైట్‌లో జరిగే సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)